CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ప్రసంగంలోనే కీలక ప్రకటన చేశారు. జై తెలంగాణ.. జై సోనియమ్మఅనే నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రం ఆశామాషీగా ఏర్పడింది కాదని అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం అనేక పోరాటాలతో, అమరవీరుల త్యాగాల పునాది మీద, ఎన్నో ఆకాంక్షలు, ఆశలతో ఏర్పడిందని అన్నారు. ఇక పై రాష్ట్ర అభివృద్దిలో మీ ఆలోచనలను పంచుకోవచ్చని అన్నారు. తెలంగాణను సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ రేవంత్ రెడ్డిది అని అన్నారు.
పదేళ్లుగా నిరంకుశత్వాన్ని రాష్ట్ర ప్రజలు మౌనంగా భరించారన్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించామని అన్నారు. రేపు (శుక్రవారం) ఉదయం పది గంటలకు జ్యోతి రావుపూలే ప్రజా భవన్ గా పేరు మార్చి ప్రజాదర్భార్ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికి కృషి చేస్తానన్నారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా చేస్తానని పేర్కొన్నారు. మేం పాలకులం కాదు.. మీ సేవకులం అని అన్నారు.
కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటానని, పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్ధి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు ఫైల్స్ పై సంతకాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి, ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన ఆరు గ్యారెంటీల అమలునకు నోటుకునేలా ఆరు గ్యారెంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు. అలాగే దివ్యాంగురాలు రజినికి ఉద్యోగాన్ని ఇస్తూ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Revanth Reddy: సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎంగా భట్టి ప్రమాణ స్వీకారం