TRS : పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై బీజెపీ కార్యకర్తల దాడిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ఆయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి వసూలు చేస్తున్న చందాలను బీజెపీ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇంటిపై బీజెపీ కార్యకర్తలు దాడికి పాల్పడారు.
దీనిపై స్పందించిన కెటిఆర్ ప్రకటన విడుదల చేస్తూ టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ అన్న విషయం బీజెపీ మరిచిపోకూడదని హెచ్చరిస్తున్నామన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. టిఆర్ఎస్ శ్రేణులను కాపాడుకునే శక్తి, బలం తమకు ఉన్నాయని విషయాన్ని బీజెపి గుర్తుంచుకోవాలన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెట్టిలా బీజెపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ నిలదీయాలన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటులేదని అన్నారు. బీజేపీ నేతల తీరును ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాలని కేటిఆర్ కోరారు. టిఆర్ ఎస్ కార్యకర్తలకు ఓపిక నశిస్తే బీజెపీ నేతలు కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.