Mamagaru: ప్రస్తుత కాలంలో చాలామంది నటీనటులు వెండి ధర నుంచి బుల్లితెరకి ఎంట్రీ ఇస్తున్నారు. వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో పోషించే నటీమణులు అంత బుల్లితెరపై సందడి చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు. అటువంటి వారిలో హీరోయిన్ సుహాసిని కూడా ఒకరు. దేవత సీరియల్ లో సుహాసినిగా ప్రతి ఒక్కరిని మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ 2003లో తెలుగు సినీ ప్రేక్షకులకు చంటిగాడు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది.
ఈ ముద్దుగుమ్మ 1953 మే 26న జన్మించింది. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఓ తమ్ముడు సైతం ఉన్నాడు. అతని పేరు అనుదీప్. ఈ ముద్దుగుమ్మ తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిజానికి సుహాసిని ఇండస్ట్రీకి రావడం మొదట్లో తన తండ్రికి అసలు ఇష్టం ఉండేది కాదట. అనంతరం చంటిగాడు సినిమా హిట్ కావడంతో తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారట. చంటిగాడు మూవీ అనంతరం లక్ష్మీ కళ్యాణం, అడ్డా, సందడి, పెద్దబాబు, దోస్త్ ఇలా దాదాపు 19 సినిమాలలో ప్రముఖ పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఇక సినిమా అవకాశాలు తగ్గడంతో 2010లో జెమినీ టీవీలో వచ్చిన ఓ సీరియల్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అష్టాచమ్మా, గిరిజా కళ్యాణం, ఇద్దరమ్మాయిలు వంటి సీరియల్స్ లో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక తమిళ్లో కూడా ఓ సీరియల్ లో నటించిన సుహాసినిజ…మన తెలుగులో నటించిన ఇద్దరమ్మాయిలు సీరియల్ లో సమయంలో హీరో ధర్మతో లవ్లో పడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో అనంతరం గిరిజ కళ్యాణం సీరియల్ కూడా వచ్చింది.
ఇక 2011లో ఈ ముద్దుగుమ్మ బెస్ట్ యాక్టర్ అవార్డును సైతం గెలుచుకుంది. ఇక ఈమె కేవలం నటనకే పరిమితం కాకుండా కొన్ని సీరియల్స్ కి నిర్మాణం సైతం వ్యవహరిస్తుంది. ప్రస్తుతం మామగారు సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక నిజానికి సుహాసిని కి మొదట్లో పెల్లన్న హస్బెండ్ అన్న అసలు ఇష్టం ఉండేది కాదట. కానీ తన అత్తను చూసి ఒప్పుకుందట. తన అత్త చూపించే ప్రేమ ఆప్యాయతలకు ఫిధాయి ఈ ముద్దుగుమ్మ పెళ్లి బంధం లో అడుగు పెట్టింది. ఇక సుహాసిని తన మనసు మార్చుకుని సినిమా ఇండస్ట్రీలోకి కనుక అడుగుపెడితే ఈమెకి మంచి గుర్తింపు దక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు హీరోయిన్స్ ని ఇప్పుడు తరం ప్రేక్షకులు ఎంతో మిస్ అవుతున్నారు. ఆ లోటును కనుక సుహాసిని తీరిస్తే ఈమె కెరీర్ కి ఏ డోకా ఉండదు.