21Days Baby: ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే చాలు.. కొంతమంది ఆ ముక్కుపచ్చలారని పసికందులను చెత్తకుండీలో, రైలు పట్టాల వద్ద వదిలేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఇటువంటి విచిత్ర ఘటన గంగానది దాద్రీ ఝాట్ వద్ద చేసుకుంది.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ గంగానది దాద్రీ ఝాట్ సమీపంలో మంగళవారం సాయంత్రం నీటిపై తేలుతూ ఒక చెక్కడబ్బా కనిపించింది.. ఆ చెక్కడబ్బా కు దగ్గరలోనే ఉన్న ఓ బోటు యజమాని గుల్లు వెంటనే ఆ డబ్బును తెరిచి చూడగా తన కళ్ళు నమ్మలేని దృశ్యాన్ని చూశాడు..!! ఆ డబ్బాలో ఒక పాప, దేవుళ్ళ ఫోటోలు, పాప జాతకం తో పాటు ఓ తెల్లని కాగితంపై ఈ పాప పేరు గంగా అని రాసి పెట్టారు..!!
ఆ గంగమ్మ తల్లే ఈ పాపను మాకు ప్రసాదించిందని బోటు యజమాని ఆ పాపను ఇంటికి తీసుకు వెళ్ళాడు.. తన భార్య సాయంతో పాపను శుభ్రం చేసి ఆకలిని తీర్చారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి పోలీసులకు తెలిసింది.. పోలీసులు వచ్చి ఆ పాపను స్వాధీనం చేసుకుని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. వైద్యులు ఈ పాప పుట్టి 21 రోజులు అయి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పాప తల్లిదండ్రులు ఎవరు, ఆ పాప ఎవరు నదిలో వదిలి పెట్టారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చిన్నారి సంరక్షణ బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వానిదే అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. యజమానిని కూడా ఆయన కొనియాడారు. అతడు మానవత్వానికి ప్రతీక అని ప్రశంసించారు..