కొన్ని రోజుల ముందు కోరా లో “ ఇవాళ మీరు ఇంటర్నెట్ లో చూసిన ఒక మంచి విషయం ఏంటి?” అని ప్రశ్నించారు. దానికి సేతు కుమార్ అనే వ్యక్తి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇవాళ నేను ఇంటర్నెట్ లో ఫీడ్ స్క్రోల్ చేస్తున్నప్పుడుఒక సంఘటన నాకు కనిపించింది. ఇది అందరికీ తెలియడం ఎంతో అవసరం అని అనిపించింది.
ఈ ఫోటోలో పచ్చ రంగుతో గుర్తు పెట్టి ఉన్న వ్యక్తి.. తన ప్రాణాల తో పాటు కూతురి ప్రాణాలను అడ్డుపెట్టి ఒకరైలు ప్రమాదం జరగకుండాఅడ్డుకుని కొన్ని వందల మందికి ప్రాణ దాతగా మారాడు .జూన్ 15వ తేదీ 2018 లో ఈ సంఘటన జరిగింది. అప్పుడు సమయం దాదాపు ఐదున్నర అవుతోంది. అంబాసా నుండి అగర్తల కి వెళ్లేరైలు పట్టాలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పాడయ్యాయి.
ఆ విషయం ఇతనికి తప్ప ఎవరికీ తెలియదు.అలాంటి దిక్కు తోచని పరిస్థితులలో అతను దాదాపు రెండు గంటల పాటు అక్కడే అలాగే రైలు కోసంచూసి ఎదురుచూసి తన గురించి, తన కూతురు గురించి లెక్కచేయకుండా రైలు కి అడ్డంగా నిలబడి టవల్ చేతిలో పట్టుకొని ఊపాడు. ట్రైన్ నడిపే వ్యక్తి అ తనిని చూసి ఏదో ప్రమాదం ఉంది అని గ్రహించి రైలు ఆపాడు. దాంతో ప్రమాదం తప్పింది.
ఈ వ్యక్తి పేరు స్వపన్ దెబ్బర్మ. ఇతను ముంగియాకామి ప్రాంతం లో నివసిస్తాడు. స్వపన్ పక్కన ఉన్నపాప అతని కూతురు, లోకో పైలట్” అని పేర్కొన్నారు. రైలు వచ్చేంత వరకు ఓర్పుగా అక్కడే ఎదురు చూసి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన స్వపన్ దెబ్బర్మ చేసిన పని నిజంగానే ఎంతో అభినందించాల్సిన విషయం. స్వపన్ దెబ్బర్మ ఆదర్శనీయులు అనడం లో ఎలాంటి సందేహం లేదు.