తన చెల్లెలి పై అఘాయిత్యం చేసి ఆమె చావుకు కారణమైన ఒక మదోన్మాదిని ఆమె అన్న ఇప్పుడు చాలా సంవత్స్రాల తర్వాత మట్టుబెట్టాడు. 2014లో ఢిల్లీకి చెందిన జకీర్ అనే వ్యక్తి తన చెల్లి తో కలిసి అంబేద్కర్ కాలనీ లో నివాసం ఉండే వాడు. అప్పుడే మెహతాబ్ వారికి పరిచయం అయ్యాడు. మంచి మాటలతో నమ్మించి మోసం చేసి వారికి సన్నిహితుడిగా మారాడు. అయితే కొద్ది రోజులకే అతని నిజస్వరూపం బయట పడింది.
జకీర్ చెల్లెలిపై మెహతాబ్ అతను లేని సమయం చూసి అఘాయిత్యం చేశాడు. ఇక ఆ విషయం అన్నకు చెప్పుకోలేక మరియు అవమానం తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. దాంతో మెహతాబ్ ని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో నిలబెట్టారు. అతనికి కోర్టు జైలు శిక్ష విధించింది. గత కొంత కాలంగా మెహతాబ్ జైల్లోనే ఉన్నాడు అయితే జకీర్ మాత్రం అతనికి జరిగిన అన్యాయానికి మరియు తన చెల్లిలి చావు ని జీర్ణించుకోలేకపోయాడు.
తనకు ఇంత అన్యాయం చేసినా మెహతాబ్ ను ఎలాగోలా చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే అతను జైలు కి వెళ్ళాడు వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా మెహతాబ్ ను హత్య చేశాడు. ఇక జైలు అధికారులు ఈ విషయం తెలిసిన వెంటనే అతన్ని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం జకీర్ కేసు కోర్టులో ఉంది