Covaxin Trials: మన దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ covid 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్న విషయం అందరికీ తెలిసినదే.. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలకు కూడా టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ చిన్నారులపై ట్రయల్స్ కు డిసిజీఐ అనుమతి ఇచ్చింది.. ఈ నెల 14న పాట్నా ఎయిమ్స్ లో చిన్నారులపై కోవ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించారు.. తాజాగా చిన్నారులపై నిర్వహించిన కోవ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం అయినట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది..!!
మొదట పాట్నాకు చెందిన డాక్టర్ సంతోష్ సింగ్, డాక్టర్ వీణ సింగ్ లు తమ పిల్లలు సత్యం (13), సమ్యక్ (7) లకు కోవ్యాక్సిన్ వేయించారు. ఈ విషయంలో ఎయిమ్స్ – పాట్నా వైద్యులు అగ్ర భాగాన ఉన్నారు. 6 – 12 సంవత్సరాల మధ్య ఉన్న 7గురు పిల్లలు, 12- 18 సంవత్సరాలు ఉన్న 20 మంది వ్యాక్సిన్లు ఇచ్చారని పాట్నా ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సీ.ఎం.సింగ్ తెలిపారు.