ప్రజల అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించే ఆసుపత్రులకు కనీసమైన కనికరం మరియు మొహమాటానికి కూడా మానవత్వం కలగడం లేదు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన గురించి వింటే ఎవరి ప్రాణమైనా చివుక్కుమంటుంది.
వివరాల్లోకి వెళితే ఒక ముసలాయన ఆసుపత్రిలో అడ్మిట్ కాగా అతని ట్రీట్మెంట్ మొత్తం పూర్తి అయ్యేసరికి 11 వేల రూపాయల బిల్లు అయింది. ముందు డిపాజిట్ కింద ఆసుపత్రిలో చేరే సమయంలో ఐదు వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులు కట్టగా ఆ తర్వాత మిగిలిన మొత్తం చెల్లించడానికి వారి వద్ద డబ్బులు లేవు.
అయితే షాజాపూర్ లో ఉన్న ఈ ఆస్పత్రి యొక్క యాజమాన్యం మాత్రం అతను బిలు చెల్లించకుండా హాస్పిటల్ నుండి బయటికి వెళ్లకుండా తాళ్లతో అతను ట్రీట్మెంట్ తీసుకున్న మంచానికి కట్టేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అతనికి మతిస్థిమితం బాగోలేదని…. ఫిట్స్ వస్తున్నాయని కావున తనకి తాను చేసుకోకుండా ఇలా కట్టేశామని వంకలు కూడా చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాస్పిటల్ యాజమాన్యం పై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు