Hyderabad Traffic Police: రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో జనాలు ట్రాఫిక్ సమస్య విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటికే ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫ్లైఓవర్లు.. ఇంకా పలు మార్గాల ద్వారా ట్రాఫిక్ సమస్యను నిరోధించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఇదే సమయంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడిపే పరిస్థితి. ఈ పరిణామాలతో చాలా చోట్ల ప్రమాదాలు కూడా సంభవిస్తూ ప్రాణనష్టం జరుగుతూ ఉన్నాయి. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గత కొద్ది నెలల నుండి… ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి భరతం పడుతున్నారు. కార్ ఆదాలకు నల్ల గ్లాసులు తీసేసి రీతిలో.. చాలా చోట్ల ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహిస్తూ చాలా మంది సెలబ్రిటీలను ఇప్పటికే పట్టుకోవడం తెలిసిందే. అక్కడికక్కడే వాళ్లకి జరిమానాలు కూడా విధించడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా లకి సంబంధించి వస్తువుల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మేటర్ లోకి వెళితే ఇకపై ఏ వాహనదారుడు ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తాడో… పట్టుబడతాడో.. సదరు వాహన యజమాని వాట్సాప్ కి చలానా పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎస్ఎంఎస్ ద్వారా చలానా రావడం తెలిసిందే. అయితే ఇకపై నుండి పోస్టల్ చలానా కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతూ ఉండటంతో దానికి చలానా పంపేలా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకోవటం జరిగింది.