అక్కినేని నాగార్జున చాలా కూల్ గా ఉండే వ్యక్తి. సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి వచ్చిన ఆయన అద్భుతమైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే మంచి సినిమాలతో స్టార్ హీరో అయ్యారు. ఆరు పదుల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో ఇప్పటికీ ఎంతమంది మోడల్ గా నిలిచారు. వ్యక్తిగతంగా కూడా మంచి పేరున్న నాగార్జున వరుసగా రెండో సీజన్ బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు.
అయితే అలాంటి నాగార్జున నోటి నుండి మొదటిసారి ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వినిపించింది. దీంతో ఆ జబర్దస్త్ కమెడియన్ పరువు పోయినంతపనైంది. వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్టులు గా వ్యవహరించారు. వీళ్ళ తరువాత మూడు నాలుగు సీజన్లను అక్కినేని నాగార్జున నడిపిస్తున్నారు. హోస్టింగ్ లో ఎవరిది పై చేయి అయినప్పటికీ రికార్డుల పరంగా నాగార్జున మొదటి ఇద్దరినీ దాటేశాడు. అతను హోస్ట్ గా రికార్డు టిఆర్పి రేటింగ్ సాధిస్తున్నాయి.
నాగార్జున ప్రత్యేకంగా ఈ సీజన్ పై దృష్టి సారించారు. వ్యక్తిగతంగా ఎన్నో మార్పులు చేసుకున్నారు. ఇందులోభాగంగానే అతని లుక్, ఫిజిక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా కొత్తగా ఉన్నాయి. ఇదే సమయంలో జబర్దస్త్ కామెడీయన్ ముక్కు అవినాష్ ని ఒక ఆట ఆడుకున్న నాగార్జున.. నువ్వు అరియానా గ్లోరీ తో నువ్వు లవ్ ట్రాక్ నడుపుతున్నావని…. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో మర్యాదగా చెప్పమని బెదిరించాడు.
ఇదే క్రమంలో అతని నోటి నుండి డబల్ మీనింగ్ డైలాగ్ వచ్చింది. ఈ సమయంలో ఒక సంభాషణను ప్రస్తావిస్తూ “అవినాష్ కు ఏమీ లేవట” అంటూ ఒక డబల్ మీనింగ్ డైలాగ్ వదిలాడు మన్మధుడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ నవ్వేశారు. వెంటనే జబర్దస్త్ స్టార్ “సార్…. నా పరువు తీయకండి నాకు చాలానే ఉన్నాయి…. అసలే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇది ఎవరైనా వింటే పిల్లను కూడా ఇవ్వరు” అంటూ వేడుకున్నాడు.