మీ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలతో పాటు పాన్కార్డు, ఆధార్ లింకు చేయకపోతే పాన్కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఇన్కామ్ టాక్స్ రిటర్నలతో పాటు ప్యాన్లను అనుసందానము చేయకపోతే వాటిని రద్దు చేస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఛైర్మన్ ఇటివలే వెల్లడించారు. ఆధార్, పాన్కార్డు నంబర్ల లింకింగ్ చేయాలని తెలిపారు. బయోమెట్రిక్ కూడిన ఆధార్ను పాన్కార్డుతో తక్షణమే లింక్చేయాలి. ఇప్పిటివరకు ఉన్న 42 కోట్ల పాన్ నెంబర్లు జారీచేయగా వీటిలో 23 కోట్ల పాన్కార్డులు మాత్రమే లింకైనట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నూతన ఆర్ధిక సంవత్సరం లోపు ఆధార్ లింక్ చేయాలి. ఆదార్ను పాన్కార్డుతో లింక్చేస్తె,పాన్కార్డును బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సంక్షేమపథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అన్నది కూడా తెలుసుకునే వీలుంటుంది. పాన్కార్డుల లింక్తో ఆదాయపన్ను చేల్లింపులను పారదర్శకం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
గతంలో సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను రిటర్నుల విధిగా ఆధార్ను పాన్తో లింక్చేయాలని అదేశిచింది. దీంతో ఆధార్ కార్డుతో పాన్కార్డును అనుసంధానం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆధార్ కార్డుతో పాన్కార్డును లింక్ చేసుకోవాలని కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఆధార్ – పాన్ కార్డ్ లింక్ సామాన్యులకు ఇబ్బందులు తెచ్చేలా ఉంది. అయితే బ్యాంకు ఖాతాలు, మొబైల్ సేవలకు పాన్ లింకింగ్ తప్పనిసరి కాదు. పాన్ కార్డును ఆధార్తో అనుసంధానించడానికి చివరి తేదీ 31 మార్చి 2021 గా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 18 కోట్ల పాన్ కార్డుదారులు ఆధార్తో లింక్ చేసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. అలాగే 2021 మార్చి 31 తర్వాత రద్దు చేసిన పాన్ ఉపయోగిస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272 బి కింద వారికి రూ .10,000 జరిమానా విధిస్తారు.