Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ అతి భారీ ప్రాజెక్టు సినిమాలలో స్టార్ హీరోల సరసన గత కొన్ని సంవత్సరాల నుండి ఏకధాటిగా నటిస్తున్న హీరోయిన్ పూజ హెగ్డే. సమంత, అనుష్క, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్లు అవకాశాలు దక్కడంతో పాటు పెళ్లిళ్లు కావటంతో ఇండస్ట్రీలో చాలా వరకు అవకాశాలు పూజ హెగ్డేకి దకుతున్నాయి. ఆ తర్వాత రష్మిక మందన కి అవకాశాలు వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో తాజాగా పూజా హెగ్డే ఒక్కో సినిమాకి తీసుకుంటున్నారని మనిషిని గురించి లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకి దాదాపు మూడు కోట్లు డిమాండ్ చేస్తుందట. అది కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేసి నిర్మాతలకు ముందే తెలియజేసి అప్పుడు సినిమా ప్రాజెక్ట్ కి సైన్ చేయటం జరుగుతుందట.
Read More: Pooja hegde : పూజా హెగ్డే నంబర్ ..!
గత ఏడాది “అలావైకుంఠపురంలో” సినిమాతో బ్లాక్ బస్టర్ పడటం అంతకుముందు “మహర్షి” ఇంకా పలు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందించడంతో… ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే కి భారీ డిమాండ్ పెరిగిందట. ప్రస్తుతం పూజా హెగ్డే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా.. మాత్రమే కాక “ఆచార్య” లో చరణ్ సరసన పాత్ర ఇంకా పలు సినిమాలలో చేస్తూ ఉంది. ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలు కలిగిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటోంది.