T20 World Cup: క్రికెట్ ఇంగ్లాండ్ లో పుట్టిన గాని ఇండియాని బాగా ఆకట్టుకున్న గేమ్. భారతదేశంలో క్రికెట్ ఆటకి ఉన్న క్రేజ్ మరొక ఆటకి ఉండదు. అంతలా భారతీయులు క్రికెట్ నీ ఇష్టపడతారు. ఇంక దేశవాళికి సంబంధించి క్రికెట్ ఆటగాళ్లకు సినిమా హీరోల కంటే ఎక్కువగానే క్రేజ్ ఉంటది. కొంతమంది అయితే క్రికెటర్స్ ని ఆరాధిస్తారు. ఇక సచిన్ టెండూల్కర్ కి దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ ఇతర జట్టుతో జరిగే ఏదైనా మ్యాచ్ లో దేశం తరఫున సెంచరీ లేదా బాగా గేమ్ ఆడాడు అంటే అతడి జీవితం ఇంకా ఇండియాలో సెటిల్ అయిపోయినట్టే.
అదే సమయంలో సదరు క్రికెట్ ప్లేయర్ తో యాడ్ రంగంలో కూడా పలు కంపెనీలు ప్రచార కార్యక్రమాలు చేయడానికి కూడా కోట్ల రూపాయలు ధారపోయడానికి ముందుకు వస్తాయి. ఎంతో అత్యంత ఆదరణ కలిగిన ఈ క్రికెట్ గేమ్ కి సంబంధించి ఓ సరికొత్త న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. మేటర్ లోకి వెళ్తే త్వరలో T20 వరల్డ్ కప్ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వేదికగా ఈ టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో T20 వరల్డ్ కప్ లో ఇండియా ఆడే మ్యాచ్ లు అన్నిటిని ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఐసీసీతో .. ఐనాక్స్ ఒప్పందం చేసుకోవడం జరిగింది.
దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాలలో ఇండియా ఆడే మ్యాచ్ లను ఐనాక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి పూనుకుంది. టీవీలో చూస్తేనే మంచి గూస్ బాంప్స్ కలిగే అనుభూతి కలిగిన ఈ క్రీడా కొన్ని వందల మంది సమక్షంలో థియేటర్ లో అంటే ఆ ఎంజాయ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇది కచ్చితంగా క్రికెట్ లవర్స్ కి అదిరిపోయే న్యూస్. ఈ క్రమంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ థియేటర్ లో పడితే .. అది ఇంకా వేరే లెవెల్ అంటూ తాజా న్యూస్ పై క్రికెట్ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు.