సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వెజ్ ని తినడం మానేసి నాన్ వెజ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలను చూస్తున్నారు కానీ మనకి ఏర్పడే జబ్బులని ఎవ్వరూ లెక్క చేయడం లేదు. సండే అయితే చాలు ప్రతి ఒక్కరు చికెన్ పై మక్కువ చూపిస్తుంటారు. ఇక ప్రస్తుతం చికెన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోడి మీద వ్యామోహం తగ్గించుకోకుంటే డేంజర్ లో పడ్డట్లే అంటున్నారు డబ్ల్యుహెచ్వో.
చివరికి కోడి కూడా మనుషులని భయపెడుతుంది. అలా ఉంది మరి మన ప్రపంచం. తరచూ చికెన్ తినడం ద్వారా అతిపెద్ద వ్యాధికి గురవుతారని హెచ్చరిస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ అధికారులు. చికెన్ని మానుకోకపోతే మీ ప్రాణాలపై మీరు నమ్మకం వదిలేసుకోవాల్సిందే. మీరు చికెన్ తింటున్నారని అనుకుంటున్నారు కానీ మీరు తినేది 200 రోగాలు. అదేవిధంగా మీరు తినేది పాయిజన్. ఏ ఫారం లో అయినా కోడిని రెండు రోజుల్లో పెంచగలిగే సామర్ధ్యాత కలిగి ఉంటారు.
వాటికోసం అనేక ఇండక్షన్స్ మరియు టాబ్లెట్స్ వేయడం ద్వారా దాని బాడీ పెరిగి పెద్ద దానిలాగా కనిపిస్తుంది. దానిని మనం తినడం ద్వారా అనేక అనారోగ్యాల సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా దరి చేరతాయి. అందువల్ల చికెన్ని తినడం మానుకోమంటున్నారు నిపుణులు. లేదంటే రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు ఉండదు అంటున్నారు.
అందువల్ల చికెన్ తినడం పూర్తిగా మానేయమనడం లేదు .. సహజ పద్ధతిలో తయారైన చికెన్ని తీసుకోవడం మంచిది. మార్కెట్ దగ్గర చికెన్స్ అస్సలు కొనవద్దు. ఇలా కొనడం ద్వారా మన ప్రాణాలు రిస్క్ లో పడినట్లే. మన ప్రపంచంలో ప్రతిదీ కల్తీనే జరుగుతుంది. కల్తీ జరగనివి అంటూ ఏమీ లేవు. మన శరీరం దగ్గర నుంచి తినే ఆహారం వరకు ప్రతిదీ కల్తీనే . అందువల్ల నాచురల్ పద్ధతిలో తయారైన చికెన్ ని తీసుకోవడం మంచిది.