దేవాస్ (మధ్యప్రదేశ్): తంబూర పట్టుకుని గానం చేస్తున్న ఈ వ్యక్తి సాధాకరణ కళాకారుడు కాదు. భారతదేశంలోని భోపాల్, జబల్పూర్, పాట్నా, లక్నో, కాన్పూర్ వంటి పట్టణాలలోనే కాక అమెరికా, పాకిస్థాన్ తదితర దేశాల్లో తన సంగీత మాధుర్యాన్ని వినిపించి కళాభిమానులను రంజింపజేసిన ప్రముఖ తంబూర విద్వాంసుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్లహ్లాద్ సింగ్ టిపనియా. తన ప్రదర్శన ద్వారా అనేక పురస్కారాలు అందుకున్న టిపనియాకు 2011లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతోనూ సత్కరించింది.
ఇక్కడ విషయం ఏమిటంటే ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్లోని దేవాస్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన గానుమాధుర్యాన్ని వినిపిస్తూ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచార సభకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హజరయ్యారు. రాహుల్ గాంధీ సైతం ప్లహ్లాద్ గానానికి ముగ్దుడైయ్యారు.
తన విభిన్న గానంతో ప్లహ్లాద్ ఓటర్లతో మమేకమవుతున్నారనీ, ఆయన ప్రచార శైలి చూడముచ్చటగా ఉందని పేర్కొంటూ రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్టు చేశారు. రాహుల్ గాంధీనే స్వయంగా తన సెల్ ఫోన్ ద్వారా ఈ వీడియోను తీయడం గమనార్హం.
రాహుల్ పోస్టు చేసిన ఈ వీడియోకు సుమారు తొమ్మిదివేల మందికిపైగా లైక్లు ఇచ్చారు.
I shot this little video of Shri Prahlad Tipaniya, more familiarly known as Sahab Bandgi, our candidate in Devas, MP…
He uses folk songs to connect with the audience and his campaigning style is a treat to watch! pic.twitter.com/BgeMg4BLCm
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2019