(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సెల్ఫోన్ ధ్యాసలో ఓ యువతి రైల్వే ట్రాక్ పడిపోయింది. అయితే, రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ ఘటన స్పెయిన్ లో జరిగింది. మ్యాడ్రిడ్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. స్టేషన్లో కుర్చున్న ఓ యువతి.. అనౌన్స్మెంట్ రాగానే ఫ్లాట్ఫాం మీద నడిచింది. ఆ సమయంలో ఫోన్ చూస్తూ ముందుకు నడవడం వల్ల ప్లాట్ఫాం చివరికి వచ్చినట్లు గుర్తించలేకపోయింది. దీంతో అదుపుతప్పి రైల్వే ట్రాక్ మీద పడింది. అదే సమయంలో అటుగా రైలు రావడంతో తోటి ప్రయాణికులు కంగారుపడిపోయారు. అయితే, రైలు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆమెకు పెద్దగా గాయాలేమీ కాలేదని, ఆమె సురక్షితంగానే ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు ఈ ప్రమాద వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సీసీ కెమెరాల్లో నమోదైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
?Distracted by her phone, woman walks straight onto Madrid tracks | https://t.co/N7J6EnvleV pic.twitter.com/nPo9n8wjSo
— RTÉ News (@rtenews) October 30, 2019