(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హాలీవుడ్ సినిమాలతో గ్లోబల్ స్టార్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లి అనంతరం మళ్లీ సినిమాపై ఫోకస్ పెట్టింది. ఆమె నటించిన ‘స్కై ఈజ్ పింక్’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా మారింది. బాలీవుడ్ నటి కరీనా కపూర్ జడ్జిగా వ్యవహరిస్తున్న ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ రియాలిటీ షోలో ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు మూవీ టీం సందడి చేసింది. స్కై ఈజ్ పింక్ సినిమా గురించిన అనేక కబుర్లను యూనిట్ రియాలిటీ షో సభ్యులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కరీనా, ప్రియాంక చోప్రాలు ముద్దులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియోను ప్రియాంక చోప్రా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
https://www.instagram.com/p/B215lgVnau2/?utm_source=ig_embed
ఇటీవలే టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ‘స్కై ఈజ్ పింక్’ సినిమాను ప్రదర్శించారు. సినిమా సూపర్ గా ఉందంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. రియల్ స్టోరీ ఆధారంగా సినిమాని తెరకెక్కింది. అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత ప్రియాంక చోప్రా మరో సినిమాకు సైన్ చేయలేదు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత హిందీలో ది స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటించింది. అక్టోబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.