(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాణు మండల్.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒక్కపాటతో పెద్ద సెలబ్రేట్గా మారారు. సోషల్ మీడియా సెన్సేషన్ రాణు మండల్ పాడిన ‘తేరీ మేరీ కహానీ’ సాంగ్ ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆమె ఓ బెంగాలీ పాటను పాడారు. కోల్కతాలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దుర్గా పూజపై ఆమె పాట పాడారు. రాణు మండల్ పాడిన బెంగాలీ పాటను ప్రితమ్ దేవ్ రాశారు. బెంగాలీలు దూర్గా పూజను ఎలా జరుపుకుంటారో ఈ సాంగ్లో చూపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
https://www.facebook.com/arjunpuramrasabaiclub/videos/664304033978352/
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం రాణు మండల్ పాడే ప్రతీ పాటా వైరల్ అవ్వడం కామనైపోయింది. మహారాష్ట్రలోని రాణాఘాట్ రైల్వేస్టేషన్లో పాటలు పాడుకుంటూ బిక్షాటన చేసిన రాణు మండల్ దేశం మొత్తం అభిమానులను సంపాదించుకోవడం విశేషం. నెటిజన్లు రాణు గొంతుకి ఫిదా అయ్యారు. జూనియర్ లతా మంగేష్కర్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు.
https://www.instagram.com/p/B16GjPEjxCT/?utm_source=ig_embed
ఇటీవల బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా `హ్యాపీ హర్డీ అండ్ హీర్`చిత్రంలో పాట పాడే అవకాశాన్ని కల్పించారు. ‘తేరీ మేరీ కహానీ’ అంటూ సాగే ఈ పాట కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.