(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్స్లో ఓటమి తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ఇంగ్లండ్ నుంచి గురువారం ఇండియా తిరిగి వచ్చారు. ముంబై విమానాశ్రయంలో వారిద్దరూ విమానం దిగి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇంటికి వెళ్లారు.
ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగిన సెమీఫైనల్స్లో ఇండియా 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలయింది. అనంతరం కోహ్లీ దంపతులు వెంటనే స్వదేశం రాకుండా కొద్ది రోజులు ఇంగ్లండ్లోనే ఉండిపోయారు.
విమానాశ్రయంలో వీడియో:
https://www.instagram.com/p/B0DbrkGnQ5Y/?utm_source=ig_web_copy_link