విజయవాడ స్వర్ణ పాలస్ హోటల్ లో జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిన్న ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులు… దీనిపై నిన్న మధ్యాహ్నం నుండి వరుసగా ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తూ కారకులను తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం ముగ్గురుని అరెస్టు చేసారు. హోటల్ జనరల్ మేనేజర్ సుదర్శన్, చీఫ్ ఆపరేటర్ రాజగోపాల్, నైట్ మేనేజర్ వెంకటేష్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకుని, వారు అందించే సమాచారం మేరకు మరిన్ని అరెస్టులు ఉంటె ఉండవచ్చు అంటున్నారు.
కాగా… నిన్న జరిగిన ప్రమాదంలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ మరో పది మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వెనుక అనేక అనుమానాలు, అనేక కారణాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. హోటల్ లో కొవిడ్ చికిత్స నిర్వహణకు అసలు అనుమతులు లేవని.., ఆ ఆసుపత్రిది కూడా కొంత బాధ్యత ఉంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి.