వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హోం మంత్రి పదవిని ఎస్సీ వర్గానికి చెందిన మహిళకు ఇవ్వటం దేశంలోనే సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లాకు చెందిన సుచరిత కి జగన్ మంత్రి పదవి ఇచ్చి సీనియర్ నాయకులు అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు చేశారు. అయితే ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్నా సుచరిత రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో నోరు మెదపడం లేదని… కేవలం ఆ పదవిలో కూర్చోపెట్టిన ఇంకో వ్యక్తి చేత మొత్తం తతంగాన్ని ఏపీ ప్రభుత్వం నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హోం మంత్రి పదవిలో సుచరిత ఉన్నాగాని…. గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ కి దగ్గర బంధువు హోమంత్రి చేయవలసిన పనులన్నీ ఆయన తెర వెనకాల నుండి చేస్తున్నట్లు… వార్తలు ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందువల్లే ఇటీవల తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో పోలీసులు దళితులపై దాడులు చేసినా గాని దళిత వర్గానికి చెందిన హోం మంత్రి నుండి స్పందన రాలేదని టాక్.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వర్గాల నాయకులు చాలావరకూ హోంమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. ఒక దళిత నాయకురాలు అయ్యుండి దళితులను కాపాడాల్సిన పొజిషన్ లో ఉన్నా గాని సుచరిత నోరు మెదపకపోవడం, దురదృష్టకరమని దళిత వర్గాలకు చెందిన నాయకులు సీరియస్ అవుతున్నారు. మొత్తంమీద ఏపీలో లో హోం మంత్రి ముందు వెనుక రాజకీయం అటు ఇటు గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఆ మంత్రి పదవిలో ఉండగానే ఆటలో అరటిపండు లాగా సుచరిత పరిస్థితి తయారయిందని చాలామంది అంటున్నారు.