ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి వైఎస్ జగన్ సర్కారుకు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగానే హైకోర్టు నుండి ఉత్తర్వులు వస్తున్నాయి. తాజాగా టీడీపీ నేతలకు సంబంధించిన రెండు గ్రానైట్ సంస్థలకు లీజును రద్దు చేస్తూ జగన్ సర్కారు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే.
ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు గొట్టిపాటి రవి, పోతుల రామారావులకు చెందిన గ్రానైట్ సంస్థల లీజులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని టీడీపీ నేతలు హైకోర్టులో సవాల్ చేయగా జగన్ సర్కారుకు షాక్ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్దంగా లేవన్న హైకోర్టు ఆ లీజు రద్దు నోటీసులను డిస్మిస్ చేసింది. అలాగే పన్ను నోటీసులను కూడా రద్దు చేసింది హైకోర్టు.