విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులకు శుక్రవారం బెయిల్ లభించింది. ఏపీ హైకోర్ట్.. డాక్టర్ గోపాలరావు, కె సుదర్శన్, పీ వెంకటేష్ లకు బెయిల్ మంజూరు చేసింది.
రమేష్ ఆసుపత్రి నిర్వహణలో ఉన్న స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమేష్ బాబు ఇంతకు ముందే దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించనున్నట్లు తెలుస్తున్నది.
రమేష్ ఆసుపత్రి వైద్యులపై కేసు నమోదు చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబట్టడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, దీనిపై అధికార పార్టీ నేతలు కౌంటర్ అటాక్ చేయడంతో ఈ వ్యవహారం కుల, రాజకీయ రంగు పులుముకున్నది.