విద్యావేత్త.., వ్యాపారవేత్త.., పాత్రికేయుడుగా పరకాల ప్రభాకర్ బాగా తెలుసు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీడియా సలహాదారుడిగా కూడా ఉన్నారు. ఆయన పసలేని రాజకీయుడు అనుకునే వాళ్ళు అనేకం ఉన్నారు. కానీ ఆయన భార్యపైనే గట్టి కౌంటర్ వేసి తనలోని పస చూపించారు. మొత్తానికి “పరకాల ఇంటి రాజకీయం” దేశానికి, మోడీకి అంటించారు..!!
ట్వీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు..!!
పరకాల ప్రభాకర్ కి ఆర్ధిక అంశాలపై మంచి పట్టుంది. లండన్ లో “స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్” లో డాక్టరేట్ పొందారు. చిరంజీవి 2009 లో ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ఆ పార్టీ ఆర్ధిక వ్యవహారాలు అన్నిటినీ ఈయనే దగ్గరుండి నడిపించారు. ఇప్పుడు ఈయన ప్రస్తావన, వార్తా ఎందుకు అంటే దేశంలో జిడిపి పడిపోతుంటే, ఆర్ధిక కష్టాలు పెరుగుతుంటే ఈయన భార్య.., కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ “యాక్ట్ ఆఫ్ గాడ్” అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ప్రభాకర్ తప్పు పట్టారు. ట్విట్టర్ లో చురకలు పెట్టారు. “కరోనా సమయంలో కేంద్రం అవలంభిస్తున్న ఆర్ధిక విధానాలు తప్పు.
అక్టోబర్ లోనే ఈ పరిస్థితిని ఊహించాను. ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కునే ప్రణాళికలు లేకనే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ తప్పించుకుంటున్నారని” పరకాల విమర్శించారు. మొత్తానికి ఈ ట్వీట్ తో పరకాల దేశం మొత్తం చర్చకి తెరతీశారు. ఆర్ధిక మంత్రి భర్త. ఆమెపైనే చురకలు వేశారు అంటూ కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి ఈయన భార్యతో సహా మోడీ విధానాలకు కూడా మంట పెట్టారు.
అక్టోబర్ లోనే నివేదికలు..!!
నిజానికి దేశంలో ఆర్ధిక కష్టాలు వెంటాడనున్నాయని గత ఏడాది అక్టోబర్ లోనే పరకాల ప్రభాకర్ కేంద్రానికి నివేదికలు పంపించారు. నాడు కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. కనీసం భార్య సీతారామన్ కూడా సీరియస్ గా తీసుకోలేదట. అందుకే ప్రభాకర్ కి బాగా కాళీ ట్వీట్ చేశారని అంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభాకర్ కి సమయం వచ్చింది. తానూ ఊహించినట్టే జరుగుతుంది కాబట్టి ఆయన అందుకున్నారు. దేశంలో ఆర్ధిక వృద్ధి తిరోగమనంలో ఉంది. ఇది పుంజుకోవాలంటే కొనుగోళ్ల శక్తి పెరగాలి. అది జరగాలి అంటే మధ్యతరగతికి డబ్బు, సంపాదన పెరగాలి. అందుకు కొన్ని కీలక రంగాలు పుంజుకోవాలి. ఈ లావాదేవీలు అన్ని యధాతథంగా జరిపించేలా కేంద్రం వద్ద ప్రణాళికలు లేవు కాబట్టే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ తప్పించుకుంటున్నారు అని పరకాల ప్రభాకర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.