ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అమరావతి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న టిడిపి పార్టీ లీడర్స్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మరోపక్క జగన్ తీసుకున్న ఈ 3 రాజధానుల నిర్ణయం కి గవర్నర్ ఆమోదముద్ర రావడంతో టిడిపి నేతలు ఓ రేంజ్ లో మరింతగా వైసీపీ పార్టీ పై కీలక వ్యాఖ్యలు గత కొంత కాలం నుండి చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే విషయం అప్పట్లో అనేక పేపర్లో వచ్చింది అంటూ అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటో ఏపీ క్యాబినెట్ కి తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు గడిచి పోతుంది ఈ పదహారు నెలల వ్యవధిలో రాష్ట్రంలో అనేక దోపిడీలు అవినీతి అక్రమాలు జరిగాయంటూ మండిపడ్డారు. ఇక అమరావతిలో భూములు కొన కూడదు అని ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని బోండా ఉమ నిలదీశారు.
రాష్ట్ర ప్రజలకు ఎంతో నిజాయితీగా పని చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుని కూడా తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగా అచ్చెన్నాయుడు నీ వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసుల్లో ఇరికించిదని…. అవినీతిపరుడైన మంత్రి మాత్రం బెంజ్ కార్లలో తిరుగుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు. ఇక విశాఖలో వన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది దీనికి సిబిఐ విచారణ వేసే ధైర్యం ఉందా అంటూ జగన్ కి సవాల్ చేశారు టిడిపి నేత బొండా ఉమా. ఒక బోండా ఉమా మాత్రమే కాదు విశాఖ లో రాజధాని రాకముందే కొంత మంది వైసీపీ నేతలు అక్కడి భూములు కొనుగోలు చేసినట్లు టిడిపి నాయకులు ఇటీవల ఆరోపిస్తున్నారు. ఇది వన్ సైడ్ ట్రేడింగ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.