నమ్రతా శిరోద్కర్… ఒకప్పటి హీరో, ఇప్పుడు అందాల నటుడు మహేష్ బాబు సతీమణి. ఆమె పేరు ఇటీవల అనూహ్య రీతిలో వార్తల్లోకి ఎక్కింది.
బాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరిగి ఈ కేసు విచారణలో అగ్రశ్రేణి నటుడు మహేష్బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా పేరు బయటకు వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, అంతే వేగంగా అవి సద్దుమణిగాయి. అయితే, దీని వెనుక పెద్ద స్టోరీ ఉందని టాక్.
నమత్ర పేరు తెరపైకి రావడంలో ఏం జరిగిందంటే…
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవడంలో ప్రముఖ నటీమణులు దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్సింగ్ తదితరుల పేర్లు బయటకు వచ్చాయి. అనంతరం, సుశాంత్ రాజ్పుత్కు గతంలో టాలెంట్ మేనేజర్గా వ్యవహరించిన జయా సాహా.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో నమ్రతతోపాటు నటి, మోడల్ దియామీర్జా పేరు బయటపెట్టినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆమె పేరు వచ్చిన తర్వాత….
నమ్రత డ్రగ్స్ గురించి టాలెంట్ మేనేజర్ జయ సాహా చాటింగ్ చేసినట్టు జాతీయ మీడియాలో తెరపైకి వచ్చింది. బాంబేలో మంచి ఎండీ ఇస్తావని ప్రామిస్ చేశావ్.. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం అని నమ్రత చాట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జయసాహాను విచారిస్తున్న క్రమంలో నమ్రత శిరోద్కర్ పేరు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ నటి దియా మీర్జా పేరు కూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తించినట్టు సమాచారం.
అప్పుడే నమ్రత స్పందించి…
డ్రగ్స్ కేసులో తమ పేర్లు బయటకు వచ్చినట్టు మీడియాలో కథనాలు రావడంపై నమ్రత, దియా మీర్జా స్పందించారు. తాము డ్రగ్స్ తీసుకున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. తమపై ఇలాంటి ప్రచారం చేయడం సరికాదని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా ఆ వివాదానికి చెక్ పెట్టినట్లు అయింది. అటు జాతీయ మీడియా, ఇటు తెలుగు మీడియా సైతం నమ్రత ఉదంతాన్ని కొనసాగించలేదు. వ్యూహాత్మకంగా మహేశ్ బాబు టీం, నమత్ర స్పందించడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.
హైదరాబాద్కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే…
మరోవైపు హైదరాబాద్లో డ్రగ్స్ దందాపై సంచలన వార్తలు తెరమీదకు వచ్చాయి. హైదరాబాద్కు జర్మనీ, బ్రిటన్, ఇంగ్లాండ్ నుంచి కూడా కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్శాఖ తెలిపింది. విదేశాల నుంచి స్టీల్బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్ఎస్డీ డ్రగ్స్ను అక్రమంగా భారత్లోకి తెస్తున్నట్టు పేర్కొన్నది.సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ఓ ఫార్మా దుకాణంలోనూ డ్రగ్స్ గుర్తించినట్టు తెలిపింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి దాఖలుచేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఎక్సైజ్శాఖ ఈ విషయాలు వెల్లడించింది. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలో మొత్తం 12 కేసులు నమోదైనట్టు తెలిపింది. టాలీవుడ్లో డ్రగ్స్ వాడకంపై నమోదైన కేసు సహా మొత్తం 12 కేసుల్లో.. ఇప్పటికే ఎనిమిదింటికి చార్జిషీట్ దాఖలుచేసినట్టు పేర్కొంది. వీటి ఆధారంగా విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.