దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రజల నాడి తెలుసుకోవడంలో సిద్ధహస్తుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. 2014 సార్వత్రిక ఎన్నికల టైంలో గాని, 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో గాని కేసీఆర్ వేసిన ఎత్తుగడలు ప్రత్యర్థులను చిత్తు చేసి పడేశాయి. అంచనా వేయటంలో, ఎన్నికల ఫలితాలు ముందే చెప్పటంలో కేసిఆర్ మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రుల కంటే భిన్నమని విశ్లేషకులు కూడా చెబుతారు. ఇటువంటి తరుణంలో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తో పాటు దుబ్బాక ఉప ఎన్నిక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వెంట వెంటనే వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో సీఎం కేసీఆర్ తో సహా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఇటీవల సమావేశాన్ని నిర్వహించారు. జరగబోయే ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో, ప్రత్యర్థులను ఏవిధంగ డిఫెండింగ్ చెయ్యాలి వంటి విషయాలకు సంబంధించి…. నేతలతో చర్చించారు. ఈ నేపథ్యంలో కీలకమైన గ్రేటర్ ఎన్నికల విషయంలో దాదాపు టిఆర్ఎస్ పార్టీ 104 స్థానాలు గెలవటం గ్యారెంటీ ఇదే కరెక్ట్ ఫిగర్ అంటూ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా జరగబోయే వరంగల్ మరియు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా గులాబీ జెండా ఎగరటం ఖాయమని ఈ సమావేశంలో కేసీఆర్ తేల్చేశారట. ఇదే సమయంలో కరోనా వైరస్ వచ్చిన తరుణంలో కేంద్రం రాష్ట్రానికి ఏమి సాయం చేయలేదని నేతలకు సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలో జీఎస్టీ నోట్ల రద్దు విషయంలో మద్దతు ఇస్తే ఆదుకోవాల్సిన టైములో చేతులెత్తేసింది అన్న రీతిలో ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారట.
చాలావరకు ఇటీవల బీజేపీ నాయకులు కేంద్రం కరోనా వైరస్ టైంలో చాలా నిధులు ఇచ్చినట్లు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాటిని వేరే వాటికి వాడినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కేంద్రం నుండి తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధమైన సహాయం అందింది వంటి విషయాలపై నేతలకు క్లారిటీ ఉండాలని ఈ సమావేశంలో కేసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు టాక్. ఇదిలా ఉండగా జరగబోయే ఎన్నికలలో ప్రధాన పార్టీలు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జరగబోయే జిహెచ్ఎంసి ఎలక్షన్ లో కేసిఆర్ 104 స్థానాలను టిఆర్ఎస్ పక్కగా కైవసం చేసుకుంటుంది అని జోస్యం చెప్పటంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం నెలకొంది.