ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఆయన ప్రధానితో సమావేశమయ్యారు. అయితే.. ఏపీ సమస్యలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన బకాయిలు, రావాల్సిన హామీలు, రాష్ట్ర విభజన హామీలు.. తదితర అంశాలపై సీఎం జగన్.. ప్రధానితో చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తంగా 17 అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు. ఈ భేటీలో సీఎం జగన్ వెంట.. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు.
ఇక.. ప్రధాని మోదీ సమావేశం అనంతరం.. సీఎం జగన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవనున్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అవుతుంది.