దుబ్బాక ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీలు ఎవరికివారు వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ గెలవటానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలలో ప్రతిసారి టిఆర్ఎస్ పార్టీయే గెలుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో జరగబోయే ఉప ఎన్నికలలో కూడా మరోసారి గెలిచి తన సత్తా చాటాలని టిఆర్ఎస్ పార్టీ రెడీ అయింది.
ఎన్నిక బాధ్యతలను పూర్తిగా మంత్రి హరీష్ రావుకు అప్పగించారు కేసిఆర్. దీంతో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ ఎక్కడికక్కడ ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ హరీష్ రావు… దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే…. ఈ నియోజకవర్గాన్ని మరో సిద్దిపేట చేస్తానని హరీష్ రావు ప్రజలకు హామీలు ఇస్తూ వస్తున్నారు.
అయితే నియోజకవర్గంలో పరిస్థితులు బట్టి చూస్తే టీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్న దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నట్లు మొన్నటిదాకా నియోజకవర్గంలో టాక్ వచ్చింది. నియోజకవర్గ ఉప ఎన్నిక టికెట్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పటంతో ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు నరసింహారెడ్డి, మనోహర్ రావులు పార్టీ కి బిగ్ షాక్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో దాదాపు 2000 మంది అనుచరులతో భారీగా ర్యాలీ చేసి జాయిన్ అయ్యారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ ఒకే ఒక్క సీన్ తో జరగబోయే ఉప ఎన్నిక చాలా వరకు “వార్ వన్ సైడ్” అనే టాక్ ఇప్పటి నుండే నియోజకవర్గంలో మొదలైంది.