తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉన్న కొద్ది దిగజారిపోతుంది. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి లేకపోవడంతో మొదటి నుండి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్దీ తగ్గుతూ ఉంది. పైగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు కలపడంతో.. గెలిచే స్థానాల్లో కూడా ఓడిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం… అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా..? అన్న స్థితికి చేరినట్లు టాక్ వస్తుంది.
వరుస పరాజయాలు, నేతల గ్రూపు రాజకీయాలు వల్ల జిల్లాలో కాంగ్రెస్ ఆఫీస్ కి తాళాలు వేసుకునే దుస్థితికి వచ్చేసినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుండి పార్టీ పతనం మొదలైతే ఇటీవల నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆ ప్రభావం మరింత తారస్థాయికి చేరినట్లు టాక్. కళ్ళ ముందే పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంటున్నా గాని నేతలలో స్పందన లేకపోవడంతో… కాంగ్రెస్ క్యాడర్ నిరుత్సాహం చెందుతుందట. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా తమకు ఏ పార్టీతో సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నారట.
ఎవరి తీరు వారిదే, ఎవరి దారి వారిదే… అప్పుడప్పుడు ఉనికిలో ఉన్నామని చెప్పుకోవడానికి ఏవో కొద్దిపాటి ప్రెస్ మీట్ లు పెట్టి ఎవరికి వారు వెళ్లిపోతున్నారట. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో ఒక్క సీటు కాంగ్రెస్ గెలవలేదు. పార్లమెంటు ఎన్నికలలో అయితే ఏకంగా డిపాజిట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలలో నా బలం పుంజుకోలేదు. దీంతో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అదే పరిస్థితి నెలకొనడంతో… ఒకానొక సమయంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉండే నిజామాబాదులో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ జెండా అదేవిధంగా బిజెపి రెండు తల పడుతున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో టాక్.