స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా 5 భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. సుకుమార్ గత చిత్రం రంగస్థలం పాన్ ఇండియన్ రేంజ్ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. దాంతో పుష్ప సినిమా మీద భారీ అంచనాలున్నాయి.
ఇదే ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాకి ప్లస్ కాబోతోందని చెప్పుకుంటున్నారు. కాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఫైటర్ అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. ఇప్పటికే ముంబై పరిసర ప్రాంతం ధారావి లో కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవబోతుంది. బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ సమర్పకుడిగా.. పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి చాలా వార్తలు క్రియేటవుతున్నాయి కూడా.
విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాకి నిర్మాత కేదార్ సెలగంశెట్టి. ఈయన విజయ్ దేవరకొండ కి అత్యంత సన్నిహితుడు. దాంతో సుకుమార్ రెమ్యూనరేషన్ ని కూడా విజయ్ చూసుకుంటున్నాడని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకి విజయ్ దేవరకొండ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని .. కాని తన బ్యానర్ పేరు వేసుకోవడం లేదని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలీదు గాని అదే నిజమైతే ఖచ్చితంగా సినిమా హైరేంజ్ లో ఉండటం పక్కా అంటున్నారు.