Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊహించని విషయంలో కామెంట్ తెరమీదకు వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ ఆరోపణలు, విమర్శలు కాకరేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ పొత్తులో ఎన్నికల బరిలోకి దిగిన అధికార అన్నాడీఎంకే నేతలు ప్రతిపక్ష డీఎంకేను టార్గెట్ చేస్తుండగా డీఎంకే మాత్రం, అన్నాడీఎంకేతో పాటు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై హాట్ కామెంట్లు చేస్తోంది. ఇదే ఒరవడి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సీఎం అభ్యర్థి చేసిన కామెంట్లు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రభుత్వాలను కూల్చి … క్రేజ్ తగ్గించుకొని…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రేజీ మొదట్లో ఉండేది. కానీ, రానురాను అది తగ్గిపోయింది… పోతోందని అని స్టాలిన్ కామెంట్ చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవడం లేదని ఆరోపించిన ఆయన చాలాచోట్ల ఉన్న ప్రభుత్వాలను కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇక, పార్లమెంటులో మెజారిటీ ఉండటంతో బీజేపీ అందరిని బెదిరించి బీసీఐ, ఎన్నికల సంఘం, ఐటీ, సుప్రీంకోర్టు తమ చేతుల్లో పెట్టుకుని ప్రభుత్వాలను నడుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ తీరు
జాతీయ భావ స్ఫూర్తికి వ్యతిరేకంగా డీఎంకే వ్యవహార శైలి ఉందంటూ బీజేపీ వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ ఫైర్ అయ్యారు. జాతీయ సమైక్యతకు తమిళ సంస్కృతికి బీజేపీ శత్రువని మండిపడ్డారు. బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే లక్ష్యంగా తోలుబొమ్మను ఆడించినట్టు అధికార అన్నాడీఎంకేను ఆడిస్తోందని విమర్శించారు. తమ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పని చేస్తుందని ఆయన అన్నారు. అప్రకటిత ఎమర్జన్సీలోకి దేశాన్ని బీజేపీ నెట్టేసిందని స్టాలిన్ ఆరోపణలు చేశారు.