Lock down: కరోనా కల్లోలం కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయినట్లు పలు సందర్భాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ లాక్ డౌన్లోనే పలు అంశాల్లో తెలంగాణ సర్కారుకు భారీ ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని సాక్షాత్తు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పలు కీలక విషయాలు తెలిపారు. ఇదిలాఉండగా లిక్కర్ తో సైతం భారీ ఆదాయం వచ్చింది.
Read More : YS Jagan: కరోనా ఉంటే ఏంటి… జగన్ దూకుడు ఏ మాత్రం తగ్గట్లే
లాక్ డౌన్ లో పైసలే పైసలు…
లాక్ డౌన్ ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు, రూ.35.81 కోట్ల జరిమానా విధించామని డీజీపీ తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేశామన్నారు. జనం గుమిగుడినందుకు 13,867 కేసులు.. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదు చేశామని డీజీపీ నివేదికలో తెలిపారు.
Read More : Corona: షాక్ఃకరోనా టీకా పనిచేయడం లేదని కేసు పెట్టాడు
లిక్కర్ తో కోట్లు
మరోవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉన్నా లిక్కర్ సేల్స్ తగ్గలేదు. ఇటీవలిదాకా వైన్స్కు పొద్దున పూట 4 గంటల టైం మాత్రమే ఉన్నా లిక్కర్ సేల్స్ బాగానే జరిగాయి. మే నెలలో మొత్తం రూ. 2,116 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి తరలింది. ఇందులో 26 లక్షల కేసుల ఐఎంఎల్, 20 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో రూ. 448 కోట్లు, నల్గొండలో రూ. 241 కోట్లు, హైదరాబాద్లో రూ. 191 కోట్లు, వరంగల్ అర్బన్లో రూ.180 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది మే నెలలో లాక్డౌన్ లేదు. అప్పుడు రూ.2,270 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. ఈసారి లాక్డౌన్ ఉన్నా.. మద్యం అమ్మకాలు జోరుగానే సాగాయి. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రూ. 154 కోట్ల విలువైన లిక్కర్ డిపోల నుంచి తరలింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు నెలల్లో రూ.4,388 కోట్ల లిక్కర్ అమ్ముడైంది. వీటి నుంచి సహజంగానే భారీగా సర్కారుకు ఆదాయం వచ్చింది.