YS Jagan: దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు కరోనా సెకండ్ వేవ్లో భారీగా కేసులు వెలుగు చూస్తూండటం మరోవైపు.. థర్డ్ వేవ్పై హెచ్చరికల నేపథ్యం ఆందోళనకరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమయంలో అప్రమత్తం అవుతోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో సెకండ్ వేవ్ విషయంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
Read More : Black fungus: షాక్ః కరోనా రాకపోయినా… బ్లాక్ ఫంగస్ ముప్పు మనకు ఉంటుందట
మూడో వేవ్ విషయంలో దూకుడే…
కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు వైఎస్ జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. చిన్న పిల్లలకు కరోనా మూడో దశలో ఈ మహమ్మారి సోకుతుందనే అంచనాలతో అలర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం పిడీయాట్రిక్ కోవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 8 మంది సభ్యులతో ఏపీఎంఎస్ఐడీసీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. మూడో దశలో చిన్న పిల్లలకు ఈ మహమ్మారి సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? కోవిడ్ ప్రొటోకాల్స్ ఏ విధంగా ఉండాలి? వంటి కీలక అంశాలపై ఈ టాస్క్ఫోర్స్ అధ్యయనం చేయనుంది. చిన్న పిల్లలకు ఇవ్వాల్సిన కరోనా చికిత్సపై కూడా వైద్యారోగ్య సిబ్బందికి శిక్షణపై నివేదిక కూడా ఇవ్వనుంది. ప్రాథమిక నివేదిక వారం రోజుల్లోగా ఇవ్వాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
Read More : Eatela Rajendar: ఈటల రాజేందర్… కొంత క్లారిటీ …. ఎంతో కన్ఫ్యూజన్….
కర్ఫ్యూ పొడగింపు…
ఇదిలాఉండగా మరో రెండు వారాల పాటు ఏపీ లో కర్ఫ్యూ పొడిగించే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కరోనా కట్టడి చర్యలు జూన్ చివరి వరకు చేపట్టవచ్చని.. కరోనా కట్టడికి లాక్డౌన్, కర్ప్యూ లాంటి చర్యలను ఆయా రాష్ట్రాలు కొనసాగించవచ్చని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ఈ నెల 31వ తేదీన సమీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించనున్నారు. కర్ఫ్యూ పొడగింపుపై ఈ సమీక్షా సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం.