Allu Arjun: కెరీర్ స్టార్టింగ్ నుండి వరుసపెట్టి బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్న డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటిదాకా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా గ్రాఫ్ మెయింటెన్ చేసుకుంటూ వస్తున్నాడు. దాదాపు దిగ్గజ దర్శకుడు రాజమౌళి కి దగ్గరగా ఆ తరహాలో సినిమాలు చేస్తున్నాడు కొరటాల. వరుస బ్లాక్ బస్టర్ విజయాలు చేస్తూ “భరత్ అనే నేను” తో మెప్పించిన కొరటాల తర్వాత చిరంజీవితో “ఆచార్య” స్టార్ట్ చేసిన తర్వాత మహమ్మారి కరోనా వైరస్ రావటంతో .. ఆచార్య షూటింగ్ బ్రేకులు పడుతూ ప్రస్తుతం చివరి దశలో ఉంది.
“భరత్ అనే నేను” సినిమా చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కొరటాల “ఆచార్య” స్టార్ట్ చేసినాక మహమ్మారి రావటం లాక్ డౌన్ అమలు కావటం ఆ తర్వాత ప్రభుత్వం పరిమిషన్ ఇచ్చిన కరోనా సెకండ్ వేవ్ రావటంతో .. ఆచార్య కంప్లీట్ చేయటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆచార్య సినిమా చేస్తున్న సమయంలోనే అల్లుఅర్జున్ తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో చిరంజీవి సినిమా అయిన వెంటనే బన్నీ సినిమా పరిటాల స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు.
Read More: Pushpa : పుష్పలో లవర్ బాయ్..పార్ట్ 1 లోనా 2లోనా..?
కానీ ఇంతలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా.. తానే డైరెక్ట్ చేస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చాడు కొరటాల. దీంతో అల్లు అర్జున్ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది అన్నది ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అయితే బన్నీ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి గల కారణం “పుష్ప” సినిమా రెండు భాగాలుగా చేయాలి .. అని ఒక్కసారిగా సరికొత్త నిర్ణయం తీసుకోవటంతో ఈలోపు వచ్చిన గ్యాప్ లో ఎన్టీఆర్ తో కంప్లీట్ చేసి ఆ తర్వాత వెంటనే బన్నీ సినిమా స్టార్ట్ చేయాలని తాజాగా పోరాటాలు అనుకున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు బయటపడింది. ప్రస్తుతం కొరటాల “ఆచార్య” సినిమా దాదాపు కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉండటంతో తన ఫోకస్ అంతా తారక్ సినిమాపై పెట్టినట్లు సమాచారం.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!