KCR: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలోత్వరలో మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న ఈ ముఖ్య నేతకు మళ్లీ టైం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆయనే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఉమ్మడి రాష్ట్రంలో, అనంతరం తెలంగాణ ఏర్పడ్డాక సీనియర్ లీడర్ గుర్తింపుతో పాటుగా వివిధ శాఖల్లో మంత్రిగా ఎంతో అనుభవమున్న కడియంకు కొద్దికాలంగా పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ గులాబీ పెద్దలు ప్రాధాన్యాం తగ్గిస్తూ వచ్చారు. ఈ మధ్యనే శ్రీహరి ఎమ్మెల్సీ పదవీకాలం సైతం ముగిసింది. ఇలాంటి సమయంలో వరంగల్ పర్యటన సందర్భంగా కేసీఆర్ కడియం ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడంతో కడియంకు అన్నీ మంచి రోజులే అంటున్నారు.
Read More: corona: గుడ్ న్యూస్ఃపిల్లలకు కరోనా ముప్పు తక్కువట
కేసీఆర్ సెంటిమెంట్ మారింది…
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ టూర్ అనగానే గుర్తొచ్చేది రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసం. 20 ఏళ్ల కింద ఉద్యమ సమయంలో.. ఇప్పుడు సీఎం అయ్యాక కూడా కేసీఆర్ ఉమ్మడి వరంగల్ పర్యటనకు వచ్చారంటే హంటర్ రోడ్డులోని కెప్టెన్ ఇంట్లో దిగాల్సిందే. లంచ్ అయినా.. డిన్నర్ అయినా..చివరకు ఒక రోజు బస చేయాలన్నా అక్కడే ఉండేవారు. సీఎం గత నెల 21న ఎంజీఎం విజిట్ సందర్భంలోనూ కెప్టెన్ ఇంట్లోనే ఉన్నారు. అలాంటిది ఈ పర్యటనలో సరికొత్త చిత్రం కడియం ఇంట్లో లంచ్ చేయడం మారిన సమీకరణాల మహత్యం అంటున్నారు.
Read More: Corona: గ్యాప్ ఇవ్వండి మహప్రభో…. దేశంలో ఇంకో కరోనా ఫంగస్….
ఈటల కోణంలోనే….
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే. పార్టీ డైరెక్షన్లోకనే కడియం శ్రీహరి వారం కిందట విలేకరుల సమావేవం పెట్టి ఈటల బీజేపీలో చేరడంపై విమర్శలు చేశారు. కమ్యూనిస్ట్ కాస్తా ఫ్యూడలిస్ట్ అయ్యాడంటూ దెప్పిపొడిచారు. ఇది జరిగాక ఐదు రోజులకే సీఎం వరంగల్ టూర్ లో కడియం ఇంట్లో లంచ్ చేయడంతో శ్రీహరికి తిరిగి ప్రాధాన్యతగల పదవి ఖాయమన్న చర్చ జరుగుతోంది.