KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అవుతే చర్యలు ఎలా ఉంటాయి? ఆయన దూకుడుగా స్పందిస్తే వేగంగా పరిస్థితులు ఎలా మారిపోతాయి? అనేందుకు తాజా పరిణామం ఉదాహరణ. కొవిడ్ చికిత్సలో భాగంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజల్లో ఆగ్రహం, ఏకంగా హైకోర్టు వరకు పిటిషన్లు దాఖలైన తరుణంలో కేసీఆర్ సర్కారు సీరియస్గా స్పందిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కొరడా ఝుళిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
Read More: Corona: కరోనాతో కాదు ఎలుకలతో చస్తున్నాం… భారత్ ను సహాయం కోరిన ఆ దేశం
కరోనా చికిత్సపై హాట్ హాట్ చర్చ
కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడిపై మరోమారు హైకోర్టు వేదికగా హాట్ హాట్ వాదనలు సాగాయి. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాం అని టీఎస్ హైకోర్టుకు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. మొదటి దశ కరోనా సమయంలో ప్రైవేటు హాస్పిటల్స్ నుండి పేషేంట్స్ కు 3 కోట్లు రీ ఫండ్ ఇప్పించాముని, ఈ సారి కూడా ప్రయివేటు హాస్పిటల్ లో వసూలు చేసిన వారికి రీ ఫండ్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఆయా ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Read More: KCR: ఈటలకు తన రాజకీయం రుచి చూపిస్తున్న కేసీఆర్
ఆస్పత్రులపై చర్యలే చర్యలు….
తెలంగాణ రాష్ట్రంలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వైద్యశాలల లైసెన్స్లను రద్దు చేయడంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటివరకు 113 దవాఖానలకు వైద్య ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తాజాగా కొత్తగా 8 ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు జారీ చేసింది. ఇదిలాఉండగా ,రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 22 కొవిడ్ దవాఖానల లైనెన్స్లు రద్దయ్యాయి. మరోవైపు కొవిడ్ లైసెన్స్ రద్దు చేయడంతో డీహెచ్ శ్రీనివాస్రావుతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సమావేశం అవుతున్నాయి. తమ ఆస్పత్రులకు కొవిడ్ లైసెన్స్ రద్దు చేయడంపై ఆరా తీస్తున్నారు. ఈ అనుమతుల రద్దు పర్వంతో తమ ఆస్పత్రులను రెప్యుటేషన్ దెబ్బ తీసుకుంటుందని, ఈ విషయంలో నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.