Raghurama Krishnaraju: రఘురామ కృష్ణరాజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ. గత కొద్దికాలంగా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. రఘురామ కామెంట్లు శృతి మించిపోవడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడుతున్నారంటూ వైసీపీ ఎంపీలు ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా లోక్సభ సచివాలయం ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు రఘురామ రాజు స్పందనపై ఆసక్తి నెలకొంది.
Read More: YS Jagan: భరించడం కష్టమే కానీ… జగన్ను అభినందించాల్సిందే.
రాజుగారు మామూలుగా స్పందించలేదుగా..
వైసీపీ తరఫున గెలిచిన రఘురామ కృష్ణరాజు పార్టీ పెద్దలు హార్ట్ అయ్యేలా అనేక సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో
రఘురామ కృష్ణరాజుపై లోక్సభ స్పీకర్ను కలిసి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చర్యలు లేకపోవడంతో రఘురామ కృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు పేర్కొంటూ పలు ఆధారాలను సమర్పిస్తూ వచ్చారు. ఎంపీపై అనర్హత వేటు విషయంలో జరుగుతున్న జాప్యం సరైన సకేతాలు పంపించడం లేదంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభ సచివాలయం తమకు అందిన ఫిర్యాదులపై స్పందించింది. రఘురామరాజుతో పాటుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్లకు సైతం వివరణ ఇవ్వాలంటూ నోటీలు జారీ చేసింది.
Read More: AP CM YS Jagan: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్..
ఆ ముగ్గురు ఎంపీలు…
బెంగాల్లో అధికార టీఎంసీ ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్ లు సైతం పార్టీకి వ్యతిరేకంగా నడుచుకోవడంతో వారిపై టీఎంసీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు ఎంపీలకు లోక్సభ సచివాలయం నోటీసులు పంపించింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లోక్సభ సచివాలయం నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఈ ఆదేశాలపై రఘురామ రాజు ఎలాంటి స్పందన ఇస్తారో అన్న ఆసక్తి నెలకొంది.