Bigg Boss 5 Telugu: ఏడో వారం బిగ్ బాస్(Bigg Boss )హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల కోసం బంగారు కోడిపెట్ట టాస్క్ జరుగుతోంది. ఈ టాస్క్ లో…ఇంటి సభ్యులు గుడ్డు కోసం పడే పాట్లు కంటే సన్నీతో(Sunny) ప్రియ ఆంటీ(Priya) పడుతున్న గొడవ హైలెట్ గా మారింది. సన్నీ ని రెచ్చగొడుతూ ప్రియ ఆంటీ వేస్తున్న స్ట్రాటజీ లు… ఆమె గోయ్యను ఆమె తీసుకుంటున్నట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు సీక్రెట్ రూమ్ నుండి లోబో(Lobo) ఇంటిలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రోమో లో చూపించడం జరిగింది. మెయిన్ డోర్ నుండి…లోబో హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో యాంకర్ రవి విశ్వాసాన్ని ఇంకా చాలా మంది సభ్యులు అమాంతం వెళ్లి లోబో నీ హగ్ చేసుకోవడం జరిగింది.
ఇదే తరుణంలో తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jashwanth) కన్నీరు పెట్టుకున్నాడు. తనని ఇతర ఇంటి సభ్యులు అన్నారని మాటలు అన్నారని…టాస్క్ ఆడే విషయంలో డైలాగులు నాకే పడుతున్నాయి. నేను మీ కోసం త్యాగం చేస్తుంటే… చివరాకరికి నన్ను ఎదవని చేస్తున్నారు అంటూ… తన క్లోజ్ ఫ్రెండ్స్ సిరి, జేస్సీ లతో సీరియస్ డైలాగ్ లు వేస్తూ.. షణ్ముఖ్ జస్వంత్ కన్నీరు పెట్టుకున్నాడు. మీ వల్ల నన్ను ఇంటి సభ్యులు పిచ్చి లైట్ తీసుకుంటున్నారు.
షణ్ముక్ మాటలకు జెస్సీ కూడా చాలా బాధపడ్డాడు…
జెస్సీ కెప్టెన్ అవ్వాలి అని అనుకున్నాడు వాడికి నువ్వు హెల్ప్ చేశావు. నేను ఎదవని అయ్యాను అంటూ సిరి(Siri) దగ్గర.. తన బాధను చెప్పుకుంటూ తన దగ్గర నుండి సిరిని వెళ్ళిపోమని గట్టిగా అరవడంతో… సిరి కూడా ఏడవడం జరిగింది. షణ్ముక్ మాటలకు జెస్సీ(Jessy) కూడా చాలా బాధపడ్డాడు. ఎవరికి వారు తమ స్వార్థం కోసం గేమ్ ఆడినట్లు… తనని అందరిముందు ఎదవ చేసినట్లు షణ్ముఖ్ జస్వంత్ కుమిలి పోతూ మోజో రూమ్ లో బోరున ఏడవడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే త్రిమూర్తుల మధ్య గురువారం ఎపిసోడ్ లో… పెద్ద గొడవ జరిగినట్లు అర్థమవుతుంది.