NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Dhulipalla: వదల బొమ్మాళీ నిన్ను వదల..!!

Dhulipalla: వదల బొమ్మాళీ నిన్ను వదల అన్నట్లు…గుంటూరు జిల్లా టీడీపీ నేత దూళిపాళ నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం ప్రయోగించింది. ఇంతకు ముందు సంగం డెయిరీలో చైర్మన్ హోదాలో ఉన్న దూళిపాళ్ళ నరేంద్ర అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఆనంతరం ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. ఆ తరువాత ఆయన విజయవాడలోని ఓ హోటల్ లో సంగం డెయిరీ బోర్డు మీటింగ్ ఏర్పాటుకు సమావేశమైతే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో ప్రభుత్వం సంగం డెయిరీని ఏపి పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ జీవోను విడుదల చేసింది.

Another weapon against TDP Leader Dhulipalla Narendra
Another weapon against TDP Leader Dhulipalla Narendra

Dhulipalla: డీవీసీ ట్రస్ట్ స్వాధీనానికి నోటీసు

సదరు ప్రభుత్వ జీవోపై చైర్మన్ దూళిపాళ్ళ నరేంద్ర హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన జివోను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని దూళిపాళ్ళ నరేంద్ర నింపాదిగా ఉండగా… ప్రభుత్వం ఇప్పుడు ఆయనపై మరో అస్త్రం ప్రయోగించింది. దూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగం డెయిరీకి అనుబంధంగా డీవీసీ ఆసుపత్రి నడుస్తొంది అన్నది అందరికీ తెలిసిందే. పాల రైతులకు, వారి కుటుంబ సభ్యులకు 50 శాతం రాయితీతో డీవీసీ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తోంది. ఈ ట్రస్ట్ కు దూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ గా ఉన్నారు.

సంగం డెయిరీ సాధ్యం కాలేదు.. ట్రస్ట్ ఏమవుతుందో..?

అయితే తాజాగా పాల రైతులకు ఉపయోగపడుతున్న ఈ డీవీసీ మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని 6 ఏ కింద ట్రస్ట్ ఎందుకు స్వాధీననం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ ఈ నోటీసులను జారీ చేశారు. వారం రోజుల్లో ఈ నోటీసుకు సమాధానం ఇవ్వాలని కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. గతంలో సంగం డెయిరీ స్వాధీనానికి ప్రయత్నించి భంగపడిన ప్రభుత్వం..ఇప్పుడు మరో విధంగా డీవీసీ మెమోరియల్ ట్రస్ట్ స్వాధీనానికి అడుగులు వేయడం ప్రాధాన్యతను సంతరించుకోంది. దీనిపై దూళిపాళ నరేంద్ర, ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఓ పక్క రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ టీడీపీ విమర్శలు చేస్తున్న క్రమంలోనే ఒకటి తరువాత ఒకటిగా దూళిపాళ నరేంద్ర పై జరుగుతున్న ప్రభుత్వ చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

 

 

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N