Atika Mamidi: మన శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాలలో మూత్ర పిండాలు కూడా ఒకటి.. వాటికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.. లేదంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. రాళ్ళు ఏర్పడితే ఆపరేషన్ చేయాలి. కిడ్నీలో రాళ్లు కరిగించే శక్తి ఈ అద్భుతమైన ఆకుకు ఉంది.. ఈ ఆకుతో కిడ్నీలో రాళ్లు ఎలా చెక్ పెట్టవచ్చో ఇప్పుడు చూద్దాం..!!
లక్షలు ఖర్చు చేసిన నయం కానీ జబ్బులను ఔషధ మొక్కలు తగ్గిస్తాయి. అటువంటి వాటిలో అటిక మామిడి తీగ ఒకటి. దీనినే అంటుడు కాయ అని పిలుస్తారు. ఈ తీగ జాతి మొక్క లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కిడ్నీ లో రాళ్ళను కరిగించే శక్తి ఈ మొక్కకు ఉంది. మూత్రపిండాల లో రాళ్ళు కరగడానికి ఈ ఆకుల కషాయం గ్రేట్ గా పనిచేస్తుంది. అన్ని రకాల కిడ్నీ సమస్యలకు చెక్ పెడుతుంది.
అటిక మామిడి తీగ ను సమూలంగా తీసుకోవాలి. అంటే పువ్వులు, కాయలు, ఆకులు, వేర్లతో సహా తీసుకోవాలి. వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఒక గ్లాసు నీటిలో వీటన్నింటినీ వేసి బాగా మరిగించాలి. నీరు బాగా మరిగాక ఒక గ్లాసు లోకి వడపోసుకోవలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ఉదయం పరగడుపున తాగాలి. ఈ కషాయం తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి. ఆపరేషన్ అవసరమే ఉండదు. ఒకసారి మీరు ఈ ఆకుల కషాయం తాగాలి అంటే ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు తీసుకోవటం ఉత్తమం