Bheemla Naayak: `భీమ్లా నాయక్` ఫిబ్రవరి 25వ తారీకు విడుదల అయ్యి రెండు తెలుగు రాష్ట్రాలలో విదేశాలలో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఏపీలో ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా గాని..`భీమ్లా నాయక్`రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ఇండస్ట్రీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓవరాల్ గా 150 కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో `భీమ్లా నాయక్` సినిమా యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది. సక్సెస్ మీట్ లు కూడా భారీ ఎత్తున పెడుతున్నారు.
అంతా బాగానే ఉన్నా గానీ ఈ సినిమాలో మలయాళ నటి రా నా పక్కన టాప్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన సంయుక్త మీనన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. మేటర్ లోకి వెళ్తే `భీమ్లా నాయక్` అలా చేయడం నాకు నచ్చలేదు అని ఆమె అన్నట్లు టాక్. విషయంలోకి వెళితే మొదటినుండి సినిమాలో హీరోయిన్ లకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఎక్కడ సన్నివేశాలు కనబడలేదు. కేవలం హీరోయిన్లు పెట్టాలి… తరహాలోనే… నిత్యామీనన్, సంయుక్త మీనన్ పాత్రలు ఉన్నాయి. దీంతో ఈ విషయంలో ఇప్పటికే నిత్యామీనన్ ఫీల్ అయ్యి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అదేవిధంగా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావటం లేదని టాక్ వినపడుతోంది. ఇప్పుడు ఇదే ఈ విధంగా నిత్యా మీనన్ కూడా అలిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో వస్తున్న వార్తలపై నిత్యామీనన్ స్పందించింది. ఆమె ఏమంది అంటే..నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ `భీమ్లా నాయక్` లో నా పాత్ర విషయంలో కాదు. అభిమానులందరితో కలిసి రెండవ సారి సినిమా చూడాలనుకున్నా. కానీ టిక్కెట్లు దొరకలేదు. అందుకే మనస్తాపం చెందాను“ అని సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది. సినిమా హీరోయిన్ కి అది సినిమా టికెట్ దొరకకుండా.. అసలు ఎక్కడైనా ఉంటుందా..? కావాలని ఆమె అలా మాట్లాడుతుంది నిజంగా ఆమె చాలా ఫీల్ అయింది. సినిమాలో హీరోయిన్ లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని సామాన్య ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ కలిగిన హీరోల సినిమాలలో హీరోయిన్ల గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు అని అభిమానులు అంటున్నారు.