Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోల కంటే బిజీగా ఉన్నారు. ఇక ఇదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో నటించిన “ఆచార్య” వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేరు శ్రీను.. సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాల్తేర్ శీను సినిమాలో రవితేజ కూడా చిరంజీవితో పాటు నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా లో స్పెషల్ అట్రాక్షన్ గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతిధిపాత్రలో నటిస్తున్నట్లు కొత్త విషయం హీరో విజయ్ దేవరకొండ బయట పెట్టేసాడు.
విషయంలోకి వెళితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రెండో సినిమా జనగణమన స్టార్ట్ కావడం తెలిసిందే. నిన్న టైటిల్ ఎనౌన్స్ మెంట్ ప్రకటన తర్వాత ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. విజయ్ దేవరకొండ మాటల సందర్భంలో నెక్స్ట్ చిరంజీవి తో పూరి జగన్నాథ్ నటిస్తున్నట్లు నోరు జారాడు. దీంతో “గాడ్ ఫాదర్” లో నటించే అవకాశం స్టోరీ బట్టి లేదు. “బోలా శంకర్” కూడా అంతే. ఇక మిగిలింది “వాల్తేరు వాసు” కాబట్టి గ్యారెంటీగా రవితేజ నటిస్తున్న ఈ సినిమాలోని పూరి కనిపించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని మేకర్స్ డిసైడ్ అయ్యారు.
ఇక ఇదే మీడియా సమావేశంలో.. చిరంజీవితో చేసే సినిమా ఎందుకు ఆగిపోయిందో కూడా వివరించారు. చిరంజీవికి కమర్షియల్ కథ చెప్పాను. స్టోరీ నచ్చింది. కానీ ఆయన నా నుండి ఎక్స్పెక్ట్ చేసింది మెసేజ్ ఓరియెంటెడ్. సమాజానికి ఉపయోగపడేలా సినిమా చేయాలనుకున్నారు. అందుకే నా ప్రాజెక్టు.. ఆగిపోయింది చిరంజీవితో అంటూ… పూరి క్లారిటీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో చేస్తున్న “జనగణమన” ప్రాజెక్ట్ కి డైరెక్టర్ వంశీ పైడిపల్లి నిర్మాతల లో ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం.