What’s App: ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన సోషల్ మీడియా ద్వారా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి రావడంతో… క్షణాల్లో సమాచారం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఒకప్పుడు వేరే దేశంలో జరిగినది ఏదైనా సంఘటన పేపర్ లోకి వస్తే గాని తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ బట్టి గంటల వ్యవధిలోనే.. ప్రపంచానికి తెలిసిపోతుంది. సోషల్ మీడియా పుణ్యమా చాలామంది స్టార్స్ కూడా అవ్వుతున్నారు. కాగా సోషల్ మీడియాలో చాలావరకు యూజర్ లు వాడేది వాట్సాప్. దీనిద్వారా పర్సనల్ మెసేజ్ లు.. గ్రూప్ చాటింగ్… ఫోన్ కాల్స్ మాదిరిగా కూడా..వాట్సాప్ కాల్స్ .. మనీ ట్రాన్సక్షన్ కూడా చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగానే జనాలు ఈ వాట్సాప్ వాడుతున్నారు. ఇటువంటి తరుణంలో గత కొద్ది నెలల నుండి వాట్సాప్ కంపెనీ యూజర్ల భద్రత దృష్ట్యా అనేక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో వేరే వాళ్ళ వాట్సాప్ ఫోన్ నెంబర్ కి సంబంధించి లాస్ట్ సీన్.. ఎవరైనా చూసే పరిస్థితి ఉండేది. వాళ్లు సెక్యూరిటీ పెట్టుకోకపోతే. కానీ వాట్సాప్ కంపెనీ గత కొద్ది నెలల నుండి… వాట్సాప్ లస్ట్ సీన్ ఎవరు పడితే వాళ్ళు చూడకూడదని..ముఖ్యంగా అపరిచితులకు తెలియకుండా… ఎక్కడికక్కడ సెక్యూరిటీ కల్పించడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఫార్వర్డ్ మెసేజ్ లకి కళ్లెం వేస్తూ వాట్సాప్ త్వరలో సరి కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే… ఒక మెసేజ్ వాట్సాప్ గ్రూపులో… ఒక గ్రూపులోని షేర్ చేసే విధంగా..స్పామ్ నీ కట్టడిచేసే తరహాలో..వాట్సాప్ కంపెనీ నిర్ణయం తీసుకోనున్నట్లువార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు… ఈ నిర్ణయంతో స్పామ్ మెసేజ్ లకి వాట్సాప్ అడ్డుకట్ట వేయనుంది. ఈ నిర్ణయంతో ఒకరి కంటే ఎక్కువమంది కి ఫార్వర్డ్ చేయాలంటే ఆ మెసేజ్ కాపీ చేసి … ఎవరికైతే పంపించాలో సదరు రెసిపెంట్ కి పంపాల్సిన పరిస్థితి ఉంటుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ కంపెనీ స్పష్టం చేయడం జరిగింది.