NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vangaveeti Radha Krishna: బెజవాడ రాజకీయాల్లో సంచలనం.. వంగవీటి రాధాతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ .. ఊహాగానాలపై క్లారిటీ ఇదీ..

Vangaveeti Radha Krishna: దివంగత వంగవీటి మోహనరంగా (Vangaveeti Ranga) తనయుడు వంగవీటి రాధా కృష్ణ (Vangaveeti Radha Krishna) తో జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విజయవాడ ఎన్బీవీకే భవన్ లో ఈ ఆదివారం జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకు శుక్రవారం నాదెండ్ల మనోహర్ అక్కడకు వెళ్లారు. అనంతరం అదే ప్రాంతంలో గల వంగవీటి రాధా కార్యాలయానికి వెళ్లారు. రాధాతో అరగంట పాటు ఏకాంతంగా మాట్లాడారు నాదెండ్ల మనోహర్. దీంతో వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం అయ్యిందనీ, అందుకే నాదెెండ్ల మనోహర్ ముందుగా ఆయనతో చర్చలు జరుపుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ నెల 4వ తేదీ వంగవీటి మోహన రంగా జయంతి నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షమంలో రాధా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది అంటూ ప్రచారం మొదలు పెట్టారు.

Janasena Leader nadendla Manohar meet vangaveeti Radha
Janasena Leader nadendla Manohar meet vangaveeti Radha

వంగవీటి రాధా కృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ పెద్ద గా యాక్టివ్ గా లేరు. దీంతో తరచు రాధా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. తన హత్యకు రెక్కి నిర్వహించారంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాధ. ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో తన స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఉండటంతో అప్పుడు కూడా మళ్లీ రాధా వైసీపీలోకి చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వారి నివాసానికి వెళ్లి రాధా, ఆయన తల్లి రత్నకుమారితో మాట్లాడటంతో అప్పటి ప్రచారానికి తెరపడింది.

 

వాస్తవానికి దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్న రంగా అభిమానులు అహ్వానించినా కార్యక్రమాలకు రాధా హజరవుతూ వస్తున్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇలా పార్టీలు మారుతూ పార్టీకి కమిటెడ్ గా లేకపోవడంతో తరచు రాధా పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ తో భేటీలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని సమాచారం. అటు నాదెండ్ల మనోహర్, ఇటు వంగవీటి రాధా కూడా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను కొట్టిపారేశారు. మర్యాద పూర్వక భేటీయే కానీ రాజకీయ అంశాలపై చర్చించలేదని ఇద్దరు నేతలు మీడియాకు తెలిపారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju