Virata Parvam: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `విరాట పర్వం`. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ప్రియమణి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఇదో విప్తవాత్మక ప్రేమకథ. అరణ్య అలియాస్ రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటించగా.. రవన్న రాసిన కవితలు, పుస్తకాలు చదివి అతనిపై ప్రేమ పెంచుకునే వెన్నెల పాత్రను సాయి పల్లవి పోషించింది. కథ మొత్తం వెన్నెల చుట్టూనే తిరుగుతుంది. భారీ అంచనాల నడము జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన దక్కించుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను మాత్రం అంతగా రాబట్టలేకపోయింది. మొదటి రోజే అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ ను సాధించలేకపోయిన ఈ చిత్రం.. అదే కంటిన్యూ చేస్తూ పూర్తిగా డల్ అయిపోయింది. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. ఇప్పటికే కేవలం రూ. 4.06 కోట్ల షేర్ను మాత్రమే వసూల్ చేసి ఫ్లాప్ గా నిలిచింది.
కలెక్షన్స్ డ్రాప్ అయిపోవడంతో.. రెండు వారాలకే ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లోకి దింపేశారు. నేటి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమాను మొదట టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్తో చేయాలని వేను ఊడుగుల భావించి.. ఆయనకు కథ వినిపించారట. అయితే మాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న తనకు ఇలాంటి కథ సెట్ అవ్వదని చెప్పి గోపీచంద్ రిజెక్ట్ చేశాడట. మొత్తానికి అలా పెద్ద ఫ్లాప్ నుండి గోపీచంద్ స్మార్ట్గా తప్పించుకున్నాడు.