NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా.. కారణం ఏమిటంటే..?

వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తనయుడు వైఎస్ జగన్‌తో కలిసి ప్లీనరీకి విచ్చేసిన విజయమ్మ సమావేశంలో మాట్లాడుతూ తన ప్రసంగం చివరలో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నాననే విషయాన్ని వెల్లడించారు విజయమ్మ.  తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్ అన్నారు. వైఎస్ఆర్ లేని లోటు తనకు ఎవరూ తీర్చలేరన్నారు. అందరినీ ఆశీర్వదించడానికి తాను ఇక్కడకు వచ్చానన్నారు. అందరి హృదయాల్లో రాజశేఖరరెడ్డి సజీవంగా నిలిచి ఉన్నారని అన్నారు. ఏపిలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. జగన్ మాస్ లీడర్ అని అన్నారు.

YS Vijayamma Quits Ysrcp
YS Vijayamma Quits Ysrcp

 

మూడేళ్ల కాలంలో మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని చెప్పారు. జగన్ చెప్పినవీ చెప్పనవి కూడా చేసి చూపించారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. తండ్రి ఆశయాలను జగన్ తప్పక నెరవేరుస్తారని విజయమ్మ అన్నారు. ప్రజల అభిమానం నుండి వైసీపీ ఆవిర్భవించిందన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలను చంద్రబాబు పక్కన పెట్టారని విమర్శించారు. చంద్రబాబు జనం నుండి వచ్చిన నేత కాదని అన్నారు విజయమ్మ. జగన్ అనేక కష్టాలు ఎదుర్కొని జనం నుండి వచ్చారన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు కల్గిన నేత జగన్ ఒక్కడేనన్నారు.  గతంలో మాదిరిగా తన బిడ్డ జగన్ ను మరో సారి ఆశీర్వదించాలని కోరారు విజయమ్మ.

 

తెలంగాణలో పార్టీ పెట్టిన తన కుమార్తె షర్మిలకు తను అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రెండు చోట్ల సభ్యత్వం ఉండొచ్చా అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందన్నారు. తను రాయని లేఖతో చేయని సంతకంతో వైసీపీకి రాజీనామా చేసినట్లుగా సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారనీ, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విమర్శలకు తావు లేకుండా ఉండటం కోసం తాను వైసీపీ నుండి తప్పుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. అక్కడ షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆమెకు అండగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన ఉనికి ఎవరికీ అభ్యంతరం కాకుండా ఉండేందుకు రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇటు జగన్, అటు షర్మిల ఇద్దరూ రాణించాలి, బాగుండాలి అని తల్లిగా కొరుకుంటానని అన్నారు. జగన్ తిరుగులేని మెజార్టీతో మరో సారి ముఖ్యమంత్రిగా గెలుస్తారని నమ్మకం ఉందని అన్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju