NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నేడు, రేపు హస్తినలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జన్ పథ్ 1లోని తన అధికార నివాసానికి చేరుకుని బస చేశారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రధాన మంత్రి మోడీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మేరకు నిధులు విడుదల, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, విభజన చట్టంలోని పెండిండ్ అంశాలు తదితర విషయాల గురించి చర్చించనున్నారని సమాచారం.

 

ఇదే క్రమంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి అందిస్తున్న రేషన్ పంపిణీలో హేతుబద్దత లేదనీ, దీని వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని కావున దీన్ని సవరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరనున్నారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటైన విద్య కళాశాలలకు తగిన ఆర్ధిక సహాయం, భోగాపురం ఎయిర్ పోర్టు నకు సంబంధించి క్లీయరెన్స్ లు, ఏపీఎండీసీ కి ఇనుప గనుల కేటాయింపునకు సంబంధించిన విషయాలను కూడా సీఎం జగన్ కోరనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా ఇటీవల గోదావరి వరదలు, భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు జిల్లాలో వేలాది ఎకరాలు ముంపునకు గురి అయ్యాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటికే కేంద్ర బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి వరద నష్టంకు సంబంధించి అంచనాలు సేకరించింది. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ త్వరలో పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. వరద నష్టం పరిహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ చర్చించనున్నారని సమాచారం.

అమలుకాని కేసిఆర్ హామీలను ఎత్తి చూపి మరీ తూర్పారబట్టిన అమిత్ షా

 

మోడీతో సమావేశం పూర్తి అయిన తర్వాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్ ఖర్ లను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయనున్నారు. తదుపరి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారని సమాచారం. అవసరం అయితే ఈ రాత్రికి కూడా ఢిల్లీలోనే బస చేసి రేపు (మంగళవారం) కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలుస్తొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హజరైన సందర్భంలో ప్రధాని మోడీతో చాలా సేపు మాట్లాడారు. ఈ నెలలోనే రెండవ సారి ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju