Breaking: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి తో గుజరాత్ అసెంబ్లీ అయిదేళ్ల కాల పరిమితి ముగియనుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన రోజునే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల అవుతుందని ఊహించారు. కానీ గతంలోనూ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలకు కొద్ది రోజుల తేడాతో వేరువేరుగా ఎసీ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించింది. అదే మాదిరిగా కొద్ది రోజుల ముందు హమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ విడుదల చేసింది.
గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1న, రెండో విడత పోలింగ్ డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్నారు. సెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. తొలి విడత ఎన్నికలకు నవంబర్ 5వ తేదీ, రెండవ విడత ఎన్నికలకు నవంబర్ 10వ తేదీ నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి విడత ఎన్నికలకు నవంబర్ 5 నుండి 14వ తేదీ వరకూ, రెండవ విడత పోలింగ్ నకు నవంబర్ 10వ తేదీ నుండి 17వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. గుజరాత్ గత (2017) ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ జరిగింది. బీజేపీకి 49.1 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 41.4 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం బీజేపీకి 111, కాంగ్రెస్ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ సారి అమ్ ఆద్మీ పార్టీ బలపడటంతో గుజరాత్ లో ఈ సారి త్రిముఖపోరు కనబడుతోంది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 92 స్థానాలు ఏదో ఒక పార్టీ గెలుచుకోవాల్సి ఉంటుంది.