నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైయ్యారు. నందిపేట్ మండల కేంద్రం సుభాష్ నగర్ కు చెందిన యువకులు కారులో కొండగట్టుకు వెళుతుండగా, ఆర్మూర్ మండలం దేవూరు గ్రామ శివారులో వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ఉమ్మడి అశోక్, మంద మోహన్, రమేష్ లు అక్కడికక్కడే మృతి చెందారు.
KCRs BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు యువకుల మృతితో సుభాష్ నగర్ లో విషాదఛ్చాయలు అలుముకున్నారు. యువకుల తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
YS Sharmila: వైఎస్ షర్మిల భీషణ ప్రతిజ్ఞ..